రూ. 33.50 లక్షల పట్టివేత
ABN , First Publish Date - 2021-04-16T05:31:28+05:30 IST
సూళ్లూరుపేటలో గురువారం సాయంత్రం పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు రూ. 33,50,900 లక్షలు పట్టుకున్నారు.
సూళ్లూరుపేట, ఏప్రిల్ 15 : సూళ్లూరుపేటలో గురువారం సాయంత్రం పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు రూ. 33,50,900 లక్షలు పట్టుకున్నారు. స్థానిక వినాయక గుడి వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎన్ 09 బీడబ్ల్యూ 6927 నెంబరు గల కారులో ఆ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. నగదుతోపాటు కారును కూడా స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ ఉమాశంకర్ తెలిపారు.