ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారం
ABN , First Publish Date - 2020-06-29T10:29:50+05:30 IST
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో (2019-20) ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదివారం నగదు పురస్కారం అందించారు.
కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో అందజేత
ఖమ్మం చర్చికాంపౌండ్, జూన్28: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో (2019-20) ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదివారం నగదు పురస్కారం అందించారు. స్వర్ణభారతి కమ్మవారి కల్యాణ మండపంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో నగదుపురస్కారంతోపాటు విద్యార్థులను సత్కరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 992 మార్కులు సాధించి స్టేట్ మొదటిస్థానంలో నిలిచిన ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్లకు చెందిన సామినేని ఆదిత్య ప్రకాష్చౌదరికి రూ.50వేలు, ఇంటర్ప్రథమ సంవత్సరంలో 465మార్కులు సాధించిన స్టేట్ మొదటిస్థానం సాధించిన ఖమ్మంలోని కవిరాజనగర్కు చెందిన అమరనేని విఖ్యాత్కు రూ.25వేల పాటు మెమోంటోను అందించారు.
ఈ కార్యక్రమంలో కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు వేజెళ్ల సురేష్కుమార్, ఉపాధ్యక్షుడు సామినేని హరిప్రసాద్, కార్యదర్శి చావా నారాయణరావు, కోశాధికారి దండ్యాల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు దిరిశాల వెంకటేశ్వరరావు, జట్ల శ్రీనివాసరావు, బత్తుల బసవపున్నయ్య, తాల్లూరి సృజన్ కుమార్, నూతలపాటి నాగేశ్వరరావు, ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ కాటేపల్లి నవీన్ పాల్గొన్నారు.