భారీగా నగదు సీజ్‌

ABN , First Publish Date - 2021-02-27T05:38:17+05:30 IST

పంచలింగాల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి 8గంటలకు ఎస్‌ఈబీ పోలీసులు ఓ న్యాయవాది నుంచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా నగదు సీజ్‌

కర్నూలు, ఫిబ్రవరి 26: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి 8గంటలకు ఎస్‌ఈబీ పోలీసులు ఓ న్యాయవాది నుంచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ లక్ష్మీదుర్గయ్య వివరాల మేరకు చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా హైదరాబాదు నుంచి కదిరి వెళ్తున్న కారును ఆపారు. కారు డిక్కీలో రూ.5 లక్షలు దొరి కాయి. క్షుణ్ణంగా తనిఖీ చేస్తే.. మరో రూ.25 లక్షలు దొరికాయి. అనంతపురం జిల్లా కదిరికి చెందిన నాగ రాజు నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థలం కొనుగోలుకు డబ్బు తీసుకెళ్తున్నానని నాగ రాజు తెలిపారు. నగదుకు ఆధారాలు చూపించక పోవడంతో కారును, నగదును సీజ్‌ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-02-27T05:38:17+05:30 IST