రేషన్ కార్డుదారులకు 2 రోజుల్లో నగదు
ABN , First Publish Date - 2020-04-09T09:41:29+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.1,500 నగదు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివా్సరెడ్డి తెలిపారు
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.1,500 నగదు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివా్సరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు రూ. 1,314 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 74 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున రేషన్ పంపిణీ చేసినట్లు వివరించారు.