కేసుల పేరుతో ఏజెంట్ల అనుమతి పత్రాల తిరస్కరణ
ABN , First Publish Date - 2021-09-19T04:20:00+05:30 IST
కేసుల సాకుతో టీడీపీ ఏజెంట్ పత్రాలను తిరస్కరించడం సబబుకాదని తడ టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి మురళీకృష్ణారెడ్డి ఆరోపించారు.
నాయుడుపేట / టౌన్, సెప్టెంబరు 18 : కేసుల సాకుతో టీడీపీ ఏజెంట్ పత్రాలను తిరస్కరించడం సబబుకాదని తడ టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి మురళీకృష్ణారెడ్డి ఆరోపించారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద శనివారం రాత్రి ఆయన మాట్లాడారు. తడ మండలంలోని 6 ఎంపీటీసీ సెగ్మెంట్లకు ఆదివారం కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. శనివారం రాత్రి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల అనుమతి పత్రాలు స్వీకరించాలని తెలపడంతో అక్కడకు చేరుకున్నామన్నారు. అయితే, కేసులు లేకున్నా, ఉన్నాయన్న సాకుతో 6 సెగ్మెంట్ల ఏజెంట్ పత్రాలను తిరస్కరించారన్నారు. వైసీపీ ఏజెంట్లకు మాత్రం అనుమతి పత్రాలు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సెక్రటరీ బొమ్మన శ్రీధర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్రెడ్డి, టీడీపీ మండల సెక్రటరీ నీలకంఠం, ఎంపీటీసీ అభ్యర్థులు, టీడీపీ నాయకులు ఉన్నారు.