చెట్టును ఢీకొన్న కారు: ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-21T13:13:36+05:30 IST

కడలూరు సమీపంలో సోమవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నాగపట్టినం జిల్లా నీర్‌ములై ప్రాంతానికి చెందిన రాము (68), లలిత(58) దంపతులు స్థానిక ఆవడి ప్రాంతంలో

చెట్టును ఢీకొన్న కారు: ముగ్గురి దుర్మరణం

చెన్నై: కడలూరు సమీపంలో సోమవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నాగపట్టినం జిల్లా నీర్‌ములై ప్రాంతానికి చెందిన రాము (68),  లలిత(58) దంపతులు స్థానిక ఆవడి ప్రాంతంలో ఉన్న కుమార్తెను చూడటానికి ఆదివారం అర్ధరాత్రి కారులో బయలుదేరారు. కారును ఆవడికి చెందిన కోదండం (50 అనే డ్రైవర్‌ నడిపాడు. ఆ కారు సోమ వారం వేకువజాము ఐదు గంటలకు కడలూరు సమీపంలోని పచ్చయం కుప్పం వద్ద వెళుతుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంస మైంది. కారు డ్రైవర్‌ కోదండం, లలిత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాము తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కడలూరు హార్బర్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కాసేపటికే రాము ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంపై కడలూరు హార్బర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-12-21T13:13:36+05:30 IST