సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ
ABN , First Publish Date - 2021-07-12T23:13:31+05:30 IST
సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ
హైదరాబాద్: సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ లిఖితపూర్వక మెమో దాఖలు చేసింది. ఓఎంసీ కేసు విచారణ వేగంగా చేపట్టాలని సీబీఐ కోర్టును కోరింది. తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని ఐఏఎస్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రతిని సమర్పించాలని శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఓఎంసీ కేసు విచారణ ఈనెల 14కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.