వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం
ABN , First Publish Date - 2020-09-24T17:02:13+05:30 IST
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణను కొనసాగిస్తున్నారు.
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణను కొనసాగిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులో గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులకు చెందిన మున్నా దంపతులు, బిట్టూ అనే హిజ్రా, మరో నలుగురు వ్యక్తులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నిన్న మున్నాకు చెందిన బ్యాంకులో 48 లక్షల నగదు, 25 తులాలు బంగారం, 20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను సీబీఐ బృందం విచారిస్తోంది.