మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ ఛార్జిషీట్

ABN , First Publish Date - 2021-11-20T23:48:58+05:30 IST

అఖిల భారతీయ అఖారా పరిషత్ చైర్మన్ ఆచార్య నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ..

మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ ఛార్జిషీట్

న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖారా పరిషత్ చైర్మన్ ఆచార్య నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ శనివారంనాడు ఛార్జిషీటు దాఖలు చేసింది. నరేంద్ర గిరి శిష్యుడు ఆనంద్ గిరి, మరో ఇద్దరిపై అలహాబాద్‌లోని కోర్టులో సీబీఐ  ఛార్జిషీటు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. అలహాబాద్ బడే హనుమాన్ ఆలయం పూజారి ఆధ్య తివారి, ఆయన కుమారుడు సందీప్ తివారిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలను నమోదు చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో సాధువులకు చెందిన అతిపెద్ద సంస్థ అయిన అఖిల భారతీయ అఖారా పరిషత్‌కు అధ్యక్షుడిగా ఉన్న ఆచార్య నరేంద్ర గిరి గత సెప్టెంబర్ 20న అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలో ఉరివేసుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Updated Date - 2021-11-20T23:48:58+05:30 IST