సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
ABN , First Publish Date - 2021-08-07T00:34:20+05:30 IST
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా
హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా కేసు నుంచి తొలగించాలన్న జగన్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తామన్న జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తామని విజయసాయిరెడ్డి, శామ్యూల్ తెలిపారు. పెన్నా కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పెన్నా, రఘురాం, ఇండియా సిమెంట్స్ ఛార్జ్షీట్లపై విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. ఈడీ కేసుల విచారణ అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఈడీ కేసుల విచారణను ఈనెల 20కి కోర్టు వాయిదా వేసింది.