డాక్టర్ సుధాకర్ కుమారుడు లలిత్ను విచారించిన సీబీఐ బృందం
ABN , First Publish Date - 2020-06-02T00:02:04+05:30 IST
డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సుధాకర్ కుమారుడు లలిత్ను సీబీఐ బృందం విచారించింది. సీబీఐ బృందాన్ని సుధాకర్ తల్లి కావేరిబాయి, దళిత నేతలు కలిశారు.
విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సుధాకర్ కుమారుడు లలిత్ను సీబీఐ బృందం విచారించింది. సీబీఐ బృందాన్ని సుధాకర్ తల్లి కావేరిబాయి, దళిత నేతలు కలిశారు. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించారని సుధాకర్ తల్లి వాపోయారు. పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులను సస్పెండ్ చేయాలని కావేరిబాయి సీబీఐని కోరింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.