గుడివాడలో కేసినోపై సీబీఐ విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2022-01-20T06:26:10+05:30 IST

గుడివాడలో సంక్రాంతి కేసినోపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు.

గుడివాడలో కేసినోపై సీబీఐ విచారణ చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద

మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


అనకాపల్లి, జనవరి 19: గుడివాడలో సంక్రాంతి కేసినోపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడి పందేలకు పర్మిషన్‌ లేదని, క్లబ్‌లు మూసేశామని, ఆన్‌లైన్‌ రమ్మి ఆట కట్టించేశామంటూ హరికథలు చెప్పిన బూతుల మంత్రి కొడాలి నాని, స్వయంగా దగ్గరుండి అసాంఘిక కార్యకలాపాలకు తెరతీయడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకలు, రంగవల్లులు, పాడి పంటలతో కళకళలాడిన ఆంధ్రప్రదేశ్‌, జగన్‌రెడ్డి హయాంలో కేసినోలు, చీర్‌గర్ల్సకు వేదికగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని వెంట నాయకులు డాక్టర్‌ నారాయణరావు, వెంకటరావు, ధనాల విష్ణుచౌదరి ఉన్నారు.


Updated Date - 2022-01-20T06:26:10+05:30 IST