వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
ABN , First Publish Date - 2022-02-14T22:00:12+05:30 IST
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కొంతకాలం గ్యాప్ తర్వాత పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు.
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కొంతకాలం గ్యాప్ తర్వాత పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణకి యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్కూమార్రెడ్డి హాజరైనారు. అంతేకాకుండా సీబీఐ విచారణకు ఓ దినపత్రిక ప్రతినిధి హాజరైనారు. ఇటీవల వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. 2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసులో సిట్ విచారణలో పురోగతి లేదని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివే కా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. కేసును సీబీఐకి అప్పగిస్తూ 2020 మార్చి 11న కీలక నిర్ణయం తీసుకుంది.