వివేకా హత్యకేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2021-08-12T21:46:54+05:30 IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ చేస్తోంది.

వివేకా హత్యకేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ చేస్తోంది. సీబీఐ విచారణకు వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి, జర్నలిస్ట్‌లు ఉమాశంకర్, భరత్ హాజరయ్యారు. ఈ కేసులో ఉమాశంకర్, ఎర్రగంగిరెడ్డిని కీలక అనుమానితులుగా సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే వీరిద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా సీబీఐ బృందాలు విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే  వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.


Updated Date - 2021-08-12T21:46:54+05:30 IST