12 పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు: సీబీఎ్సఈ
ABN , First Publish Date - 2021-05-15T07:20:52+05:30 IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీఈఎ్సఈ) 12వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు
న్యూఢిల్లీ, మే 14: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీఈఎ్సఈ) 12వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు వెల్లడిస్తామన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 14నే బోర్డు ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం నిరవధికంగా వాయిదే వేస్తున్నట్లు పేర్కొంది.