సీసీఐ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T05:51:26+05:30 IST

రైతులు సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ కోరారు.

సీసీఐ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

శాలిగౌరారం, అక్టోబరు 17 : రైతులు సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ కోరారు. మండలంలోని మాదారం కలాన్‌ గ్రామంలో టీఆర్‌ఆర్‌ కాటన్‌ మిల్లును ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం స్థానికులను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మండలంలోని పత్తి రైతులు సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాటన్‌ మిల్లు ప్రొపైటర్‌ జోజిరెడ్డి, జడ్పీటీసీ ఎర్ర రణీల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కట్ట లక్ష్మీవెంకట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కందుల అనిత, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌బాబు, మాదారం, వంగమర్తి సర్పంచ్‌లు జేరిపోతుల మంజుల, నికోల్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ తాళ్లూరి మురళి, టీఆ ర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మామిడి సర్వయ్య, కట్ట వెంకట్‌రెడ్డి, మురారిశెట్టి కృష్ణమూర్తి,  శ్రీనివాస్‌, చాడ హతీష్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-18T05:51:26+05:30 IST