కరోనాకు మాతృకలు గబ్బిలాలే: సీసీఎంబీ
ABN , First Publish Date - 2021-06-15T10:01:06+05:30 IST
‘కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే లీకైంది’ అంటూ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా కీలక
హైదరాబాద్, జూన్ 14 : ‘కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే లీకైంది’ అంటూ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న కరోనా వైర్సకు, గబ్బిలాల్లోని కరోనా వైర్సలకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు. ఈ రెండు కూడా జన్యుపరంగా 96 శాతం మేర ఒకేవిధం గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకైందనే వాదన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గబ్బిలాల నుంచి జంతువులకు, వాటి ద్వారా మనుషులకు వైరస్ సంక్రమించి ఉండొచ్చన్నారు.