క్యూ న్యూస్ ఆఫీస్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు
ABN , First Publish Date - 2021-08-25T22:22:03+05:30 IST
పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు చేశారు. క్యూ న్యూస్ ఆఫస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
మేడ్చల్: పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు చేశారు. క్యూ న్యూస్ ఆఫస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. లోపలికి మీడియాను పోలీసులు అనుమతించలేదు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరు కావాలని మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ పేరుతో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీస్ను రద్దు చేయాలని మల్లన్న కోర్టును ఆశ్రయించారు. మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్లో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్కులు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.