తిరుపతి ఉప ఎన్నిక నుంచే సత్తా చూపుతాం
ABN , First Publish Date - 2020-09-26T06:41:48+05:30 IST
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని, త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక నుంచే సత్తా చాటుతామని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం జగన్ తీరుపై మాజీ మంత్రి ఆది
మైదుకూరు, సెప్టెంబరు 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని, త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక నుంచే సత్తా చాటుతామని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మాదన్న మెమొరియల్ పాఠశాలలో శుక్రవారం ధీనబందు చటోపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ చటోపాధ్యా య సేవలను స్మరిస్తూ ఆయన బాటలోనే ప్రధాని మోదీ పయనిస్తున్నారన్నారు.
సీఎం జగన్ తిరుమల ఆలయంలో నే డిక్లరేషన్ తీసివేస్తామంటూ ప్రకటించడం సరికాదన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను తీసివే యడం ధర్మంకాదని, జగన్ చెబితేనే మంత్రులు ప్రకటనలు చేయడం తర్వాత సారీ చెప్పడం పరిపాటైం దన్నారు. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి స్ధాని క నేతలు ప్రతాప్రెడ్డి, సుబ్బరామయ్య, శ్రీజా శ్రీధర్, చంద్రశేఖర్రెడ్డి, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.