బీజేపీ కార్యాలయంలో సంబరాలు
ABN , First Publish Date - 2020-12-05T03:48:53+05:30 IST
జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రధాని మోదీ పట్ల తెలుగు ప్రజల అభిప్రాయానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు మేకపాటి రవీంద్ర పేర్కొన్నారు.
పెదవాల్తేరు, డిసెంబరు 4: జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రధాని మోదీ పట్ల తెలుగు ప్రజల అభిప్రాయానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు మేకపాటి రవీంద్ర పేర్కొన్నారు. బీజేపీ విజయంపై శుక్రవారం సాయంత్రం లాసన్స్ బే కాలనీలోని పార్టీ నగర కార్యాలయంలో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ నాలుగు సీట్ల నుంచి 40కి పైగా స్థానాలకు పార్టీ దూసుకుపోవడం బీజేపీపై ప్రజా విశ్వాసాన్ని తెలియజేస్తోందన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించి, మెయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు సురేంద్రమోహన్, కార్యవర్గ సభ్యులు ఎస్వీఎస్ ప్రకాష్రెడ్డి, చక్రవర్తి, శివాజీరాజా, ప్రసాద్, రామ్కుమార్, రాంబాబు, తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.