పట్టాభికి బెయిల్పై టీడీపీ శ్రేణుల సంబరాలు
ABN , First Publish Date - 2021-10-24T06:12:48+05:30 IST
తప్పుడు కేసులకు భయపడే సమస్యే లేదని, న్యాయస్థానం సహాయంతో తిప్పికొడతామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడుబాబు అన్నారు.
అచ్యుతాపురం, అక్టోబరు23 : తప్పుడు కేసులకు భయపడే సమస్యే లేదని, న్యాయస్థానం సహాయంతో తిప్పికొడతామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడుబాబు (డ్రీమ్స్ నాయుడు) అన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభికి బెయిల్ మంజూరైన సందర్భంగా శనివారం అచ్యుతాపురం జంక్షన్లో టీడీపీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం నాయుడుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై న్యాయస్థానం ఎన్ని మొట్టికాయలు వేసినా తన వైఖరిని మార్చుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పాలకులు తమ పద్ధతిని మార్చుకొని ప్రజారంజక పాలన అందించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సన్యాసినా యుడు, రఘు, పుర్రే శ్రీనివాసయాదవ్, కొయ్య శ్రీనివాస్, రాజు యాదవ్, ప్రవీణ్, ప్రదీప్ పాల్గొన్నారు.