వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరడంపై సంబరాలు
ABN , First Publish Date - 2021-10-23T05:14:22+05:30 IST
కొవిడ్ వ్యా క్సినేషన్ వంద కోట్ల మైలురాయిని దాట డంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సంబరాలు జరిగాయి.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: కొవిడ్ వ్యా క్సినేషన్ వంద కోట్ల మైలురాయిని దాట డంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సంబరాలు జరిగాయి. రీజనల్ డైరక్టర్ స్వరాజ్యలక్ష్మి కేక్ కట్ చేశారు. అనంతరం డీఎంహెచ్వో చంద్రనాయక్, ఏడీఎంహెచ్వో జగన్నాథరావు, డీఐవో అప్పా రావు, ఇతర సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో 16,09,662 మందికి మొదటి డోస్.. 8,41,484 మందికి రెండో డోస్ వేసినట్లు చె ప్పారు. త్వరలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపారు. అర్బన్ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.