కాషాయ దళంలో సంబరాలు
ABN , First Publish Date - 2020-12-05T05:08:01+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోవడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాషాయపు దళంలో సంబ రాలను నింపింది.
- గులాబీ శ్రేణుల్లో నిరాశ
సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోవడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాషాయపు దళంలో సంబ రాలను నింపింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా ప్రజలు ఫలితాలను ఉత్కం ఠగా పరిశీలించారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైద రాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చివరకు ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో నిరాశ పడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం గతంలో కంటే భారీగా ముందంజలో నిలవడంపై సంబరంగా ఉన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. టపాసులు కాల్చారు. మరోవైపు బీజేపీలోకి వలసలు పెరుగుతాయని చర్చలు మొదలయ్యాయి.