శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2021-04-18T07:18:29+05:30 IST
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీరాములు, ధర్మశ్రీ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు.