శ్రీవారి సేవలో ప్రముఖులు

ABN , First Publish Date - 2022-03-21T08:40:53+05:30 IST

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ రవిశంకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న పండిట్‌ రవిశంకర్‌కు వేదపండితులు ఆశీర్వచనం, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం సమీర్‌శర్మ దంపతులకు జవహర్‌రెడ్డి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. యుద్ధం ఆగాలని, విశ్వశాంతి జరగాలని కోరుకున్నట్టు రవిశంకర్‌ మీడియాకు తెలిపారు. 


Updated Date - 2022-03-21T08:40:53+05:30 IST