నేటి వరకు దసరా ఆఫర్లు: సెలెక్ట్‌

ABN , First Publish Date - 2021-10-17T06:28:40+05:30 IST

దసరా పండగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్లు.. నేటి (17 వ తేదీ) వరకు అందుబాటులో ఉంటాయని మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ సంస్థ సెలెక్ట్‌ మొబైల్స్‌ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల్లోని 80కి...

నేటి వరకు దసరా ఆఫర్లు: సెలెక్ట్‌

హైదరాబాద్‌ : దసరా పండగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్లు.. నేటి (17 వ తేదీ) వరకు అందుబాటులో ఉంటాయని మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ సంస్థ సెలెక్ట్‌ మొబైల్స్‌ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల్లోని 80కి పైగా ఉన్న సెలెక్ట్‌ స్టోర్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గత వారం ప్రవేశపెట్టిన ఈ ఆఫర్లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించటంతో వీటిని 17 వరకు పొడిగించినట్లు సెలెక్ట్‌ సీఎండీ వై గురు వెల్లడించారు. ఆఫర్లలో భాగంగా మొబైల్స్‌ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌, జీరో డౌన్‌ పేమెంట్‌తో మొబైల్స్‌ కొనుగోలు చేసే అవకాశంతో పాటు ప్రతి మొబైల్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు గురు తెలిపారు. 


Updated Date - 2021-10-17T06:28:40+05:30 IST