cell phonesను చోరీ చేస్తున్న నిందితుడు అరెస్టు

ABN , First Publish Date - 2021-11-27T12:32:34+05:30 IST

రామభద్రపురం మండల కేంద్రంలోని గాంధీబొమ్మ జంక్షన్‌లో సాయి సెల్‌షాపులో ఈనెల 26న జరిగిన దొంగతనం కేసులో ఒక బాలుడిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ లెంక

cell phonesను చోరీ చేస్తున్న నిందితుడు అరెస్టు

విజయనగరం: రామభద్రపురం మండల కేంద్రంలోని గాంధీబొమ్మ జంక్షన్‌లో సాయి సెల్‌షాపులో ఈనెల 26న జరిగిన దొంగతనం కేసులో ఒక  బాలుడిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ లెంక అప్పలనాయుడు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మండల కేంద్రానికి చెందిన 17ఏళ్ల బాలుడిని అరెస్టుచేసి అతని వద్ద నుంచి చోరీకి గురైన సెల్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, మైక్రోఫోన్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయనగరానికి చెందిన క్లూస్‌టీం ఇచ్చిన ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేయగలిగామన్నారు.  మూడు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ కృష్ణమూర్తి, మిగిలిన పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. 

Updated Date - 2021-11-27T12:32:34+05:30 IST