సెల్‌ సిగ్నల్స్‌ లేక... ఆన్‌లైన్‌కు అవస్థలు

ABN , First Publish Date - 2021-06-24T05:27:06+05:30 IST

సెల్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో పలు పంచాయతీల ప్రజలు వైఎస్సార్‌ బీమా పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

సెల్‌ సిగ్నల్స్‌ లేక... ఆన్‌లైన్‌కు అవస్థలు
సెల్‌ సిగ్నల్స్‌ కోసం దూలిపుట్టు ఘాట్‌ రోడ్డు వద్దకు వచ్చిన బుంగాపుట్టు గిరిజనులు


 

10 కి.మీ. దూరంలో ఎత్తయిన ప్రాంతానికి వెళ్లాల్సిన దుస్థితి


ముంచంగిపుట్టు, జూన్‌ 23: సెల్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో పలు పంచాయతీల ప్రజలు వైఎస్సార్‌ బీమా పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బుంగాపుట్టు పంచాయతీ ప్రజలు సెల్‌ సిగ్నల్స్‌ కోసం సుమారు పది కిలోమీటర్ల దూరంలోగల దులిపుట్టు ఘాట్‌ రోడ్డుకు వెళ్లాల్సి వస్తున్నది.  బుధవారం సెల్‌ సిగ్నల్స్‌ కోసం వర్షంలో తడుచుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డారు.


Updated Date - 2021-06-24T05:27:06+05:30 IST