పరుగులు పెట్టిన సిమెంట్ కంపెనీల షేర్లు...
ABN , First Publish Date - 2021-09-02T21:27:08+05:30 IST
సిమెంట్ కంపెనీల షేర్లు ఈ రోజు(గురువారం) పరుగులు పెట్టాయి.
హైదరాబాద్ : సిమెంట్ కంపెనీల షేర్లు ఈ రోజు(గురువారం) పరుగులు పెట్టాయి. కాగా... సిమెంట్ స్టాక్లకు ఈ రోజు ‘2’ నంబరు బాగా కలిసొచ్చింది. స్టాక్స్ అన్నీ దాదాపు రెండు శాతం మేర పెరిగాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ తదితర ఫ్రంట్లైన్ స్టాక్లతో సిమెంట్ తయారీదారుల షేర్లకు మాంచి డిమాండ్ లభించింది. ఇక... వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే ఇంట్రా డే ట్రేడ్లో అల్ట్రాటెక్ సిమెంట్ రెండు శాతం పెరిగి రూ. 7,931 కు చేరుకుంది. అంబుజా సిమెంట్స్ కూడా రెండు శాతం పెరిగి రూ. 430.35 కు చేరుకోగా, ఏసీసీ సిమెంట్స్ కూడా రెండు శాతం పెరిగి రూ. 2,469 తో గత ‘రికార్డ్ హై’లను అధిగమించి కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఈ మూడు స్టాక్లతో పాటు దాల్మియా భారత్, జేకే సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్లు రెండు శాతం చొప్పున పెరిగాయి. హౌసింగ్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో అమ్మకాలు... కోవిడ్ పూర్వ స్థాయిల కంటే దాదాపు 3.2 శాతం వద్ద కొనసాగుతున్నాయి.