ప్రైవేటీకరణ కేంద్రం కుట్రే
ABN , First Publish Date - 2021-03-06T06:30:05+05:30 IST
కేంద్రం గతంలో అనేక సంస్థలను ప్రైవేటీకరించినట్టే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించ డానికి కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఏలూరు కార్పొరేషన్, మార్చి 5: కేంద్రం గతంలో అనేక సంస్థలను ప్రైవేటీకరించినట్టే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించ డానికి కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏలూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తోందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి ఆంధ్రుల హక్కును కాల రాసేందుకు ప్రయత్ని స్తోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరి స్థితులు ఘోరంగా ఉన్నాయని, అధికార వైసీపీ ప్రలోభాలతో, భయభ్రాంతులను కలిగించి మునిసిపల్ ఎన్నికల్లో పీఠాలు కైవ శం చేసుకోవాలని ఆరాటం పడుతోందన్నారు. దేశ పరిస్థితులపై అధ్యయనం చేసి సరైన మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.