ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోంది: కేసీఆర్
ABN , First Publish Date - 2021-11-08T00:48:31+05:30 IST
ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే యాసంగిలో
హైదరాబాద్: ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి చెప్పారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులను అద్భుతంగా తీర్చిదిదద్దుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.