కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు: బాబూరావు

ABN , First Publish Date - 2020-05-25T23:19:47+05:30 IST

కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని సీపీఎం నేత బాబూరావు విమర్శించారు. నగరంలోని 19వ డివిజన్‌ లబ్బీపేట, పశువుల హాస్పిటల్‌ రోడ్డు ప్రాంతాల్లో బాబూరావు పర్యటించారు.

కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు: బాబూరావు

విజయవాడ: కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని సీపీఎం నేత బాబూరావు విమర్శించారు. నగరంలోని 19వ డివిజన్‌ లబ్బీపేట, పశువుల హాస్పిటల్‌ రోడ్డు ప్రాంతాల్లో బాబూరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మైనార్టీ మహిళలకు బియ్యం పంపిణీ  చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్, ప్రతిపక్షం మౌనం వహించడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబాకు 3 నెలల పాటు నెలకు రూ.7500 ఇవ్వాలని బాబూరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-25T23:19:47+05:30 IST