కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ABN , First Publish Date - 2021-08-03T06:47:17+05:30 IST
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడానికి డీవైఎఫ్ఐ కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు.
చిట్యాల, ఆగస్టు 2: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడానికి డీవైఎఫ్ఐ కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం నిర్వహించిన సభలో మాట్లాడారు. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేస్తున్నాయనీ విమర్శించారు. దళితబంధు హుజూరాబాద్ ఎన్నికలకే పరిమితం కావద్దని, లక్ష కోట్లు కేటాయించి రాష్ట్ర మంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలను గద్దె దించడానికి యువతను, ప్రజలను చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యో గాలను భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జాతీయ నాయకులు అభయ్ ముఖర్జీ, నాయకులు ఐత విజయ్, విప్లవ్కుమార్, సాంబ శివ నూతన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశం పాల్గొన్నారు.