ఇక సరిహద్దులకు కేంద్ర బలగాలు

ABN , First Publish Date - 2020-09-25T06:57:26+05:30 IST

ప్రస్తుతం అంతర్గతంగా భద్రత విధులు నిర్వహిస్తున్న కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించాలని కేంద్రం యోచిస్తోంది...

ఇక సరిహద్దులకు కేంద్ర బలగాలు

  • కేంద్రం యోచన.. కొద్ది రోజుల్లో నిర్ణయం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ప్రస్తుతం అంతర్గతంగా భద్రత విధులు నిర్వహిస్తున్న కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించాలని కేంద్రం యోచిస్తోంది. లద్దాఖ్‌, అరుణాచల్‌, కశ్మీర్‌ సరిహద్దుల్లో చైనా, పాక్‌ దళాల మోహరింపు పెరిగిన దృష్ట్యా సైన్యానికి తోడుగా మరిన్ని కేంద్ర దళాలను పంపాలని భావిస్తోంది. సీఆర్‌పీఎ్‌ఫను మాత్రం ఇందునుంచి మినహాయించనున్నారు. ఇప్పటికే కొంతమేర సరిహద్దు విధుల్లో ఉన్న బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ, సశస్త్ర సీమాదళ్‌ (ఎస్‌ఎ్‌సబీ) బలగాలను దేశ సరిహద్దుల్లో పూర్తిస్థాయి కాపలాకు, ఇతరత్రా విధులకు నియోగించనున్నారు. 3.25 లక్షల మంది దాకా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగం త్వరలో జరిగే బిహార్‌ ఎన్నికల్లో అక్కడి రాష్ట్ర పోలీసులకు తోడుగా 70-30 నిష్పత్తిలో విధులు నిర్వర్తించనుంది.  

Updated Date - 2020-09-25T06:57:26+05:30 IST