రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం: మధు

ABN , First Publish Date - 2021-11-28T02:22:16+05:30 IST

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ, జనసేనలు ఉదాసీన వైఖరిని విడనాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం: మధు

విశాఖ: రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ, జనసేనలు ఉదాసీన వైఖరిని విడనాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయకపోగా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. అటువంటి బీజేపీని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బలపరుస్తున్నాయని మధు విమర్శించారు. మైనింగ్‌ చట్టాలను సవరించి బాక్సైట్‌ను తరలించేందుకు మోదీ చేస్తున్న యత్నాలను తిప్పికొడతామని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్వహించాలని మధు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-28T02:22:16+05:30 IST