బీటీ పత్తి విత్తనాల ధర రూ.730

ABN , First Publish Date - 2020-03-27T07:36:35+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) జన్యుమార్పిడి(జీఎం) బాసిలస్‌ తూరింగియిన్స్‌(బీటీ) పత్తి విత్తనాల గరిష్ఠ అమ్మకం ధరను ..

బీటీ పత్తి విత్తనాల ధర రూ.730

న్యూఢిల్లీ, మార్చి26: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) జన్యుమార్పిడి(జీఎం) బాసిలస్‌ తూరింగియిన్స్‌(బీటీ) పత్తి విత్తనాల గరిష్ఠ అమ్మకం ధరను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 730 వద్దే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. ఈ సాంకేతికను సమకూర్చిన అమెరికా సంస్థ మోన్‌సాంటోకు ఏటా ఇచ్చే రాయల్టీని రద్దు చేసింది. మోన్‌సాంటోను 2018 జూన్‌లో బేయర్‌ రూ. 4.7లక్షల కోట్లకు బేయర్‌ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక 2020-21కి గాను.. బొల్‌గార్డ్‌-2(బీజీ-2) పత్తి విత్తనాల 450గ్రాముల ప్యాకెట్‌ గరిష్ఠ అమ్మకం ధరను రూ. 730గా నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Updated Date - 2020-03-27T07:36:35+05:30 IST