కేంద్రం కక్షసాధింపు చర్యలు: శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2022-01-13T23:33:34+05:30 IST
కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకు పంటలు కొనం అన్నారని, ఇప్పుడు పంటలే వద్దు అనేలా కేంద్రం ఎరువుల ధరలు పెంచిందని విమర్శించారు. ఉద్యోగులకు అత్యధిక జీతభత్యాలు ఇస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. కేంద్రం తీరును చూస్తే పార్లమెంట్ను కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో? అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్కు అప్పగిస్తున్నారని శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు.