కొవిషీల్డ్‌ రెండో డోసు గడువు పెంపు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-15T06:41:11+05:30 IST

కొవిషీల్డ్‌ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కొవిషీల్డ్‌ రెండో డోసు గడువు పెంపు: కలెక్టర్‌

ఏలూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): కొవిషీల్డ్‌ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధి ప్రస్తుతం 6 నుంచి 8 వారాలుగా ఉందని, దానిని 12 నుంచి 16 వారాలకు పెంచారని ఆయన  పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలతో తీసుకున్న నిర్ణయం కావడం వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన చెప్పారు. జిల్లాలో రెండో డోసు వాక్సిన్‌ వేయించుకోవాల్సిన వారు అందరూ వాక్సిన్‌ వేయించుకోవాలని ఆయన చెప్పారు. 


Updated Date - 2021-05-15T06:41:11+05:30 IST