Bengaluru: రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-11-14T17:56:13+05:30 IST

రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యమని కేంద్ర మంత్రి శోభకారంద్లాజే అభిప్రాయపడ్డారు. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) ప్రాంగణంలో సాగుతున్న వ్యవసాయ మేళాను శనివారం సందర్శించారు. పలు

Bengaluru: రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం

                            - కేంద్రమంత్రి శోభాకరంద్లాజే 


బెంగళూరు: రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యమని కేంద్ర మంత్రి శోభకారంద్లాజే అభిప్రాయపడ్డారు. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) ప్రాంగణంలో సాగుతున్న వ్యవసాయ మేళాను శనివారం సందర్శించారు. పలు స్టాళ్లను పరిశీలించి మహిళా రైతులతోపాటు పలువురిని వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. కోలారు, మండ్య, హాసన్‌ జిల్లాలకు చెందిన వారిని జిల్లా, తాలూకా స్థాయి సాధకులను సత్కరించారు. మూడోరోజు సందర్శకులతో కిటకిటలాడింది. ఓవైపు వర్షం రావడంతో ప్రదర్శన ప్రాంతం బురదగా మారింది. దీంతో సందర్శకులు ఇబ్బందిపడ్డారు. 

Updated Date - 2021-11-14T17:56:13+05:30 IST