కిషన్రెడ్డితో వంగా గీత భేటీ
ABN , First Publish Date - 2021-07-23T06:08:47+05:30 IST
కాకినాడ పార్లమెంట్ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కేంద్ర, సాంస్కృతిక పర్యా టక, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిని కాకినాడ పార్లమెంట్ ఎంపీ వంగా గీతా కోరారు. ఢిల్లీలో మంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలి పారు.
కార్పొరేషన్
(కాకినాడ), జూలై 22: కాకినాడ పార్లమెంట్ను అభివృద్ధి చేసేందుకు
సహకరించాలని కేంద్ర, సాంస్కృతిక పర్యా టక, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ
మంత్రి జి.కిషన్రెడ్డిని కాకినాడ పార్లమెంట్ ఎంపీ వంగా గీతా కోరారు.
ఢిల్లీలో మంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలి పారు.
ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధికి నిధులు విడుదల
చేయాలని, పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో పొన్నాడ గ్రా మంలో
ఉన్న 300 సంవత్సరాల చరిత్ర కలిగిన బషీర్బేబీ జౌలియ దర్గా మరమ్మతులకు
సహకరించాలని కోరారు. ఉప్పాడ గ్రామంలో రాష్ట్రస్థాయి హోటల్ మేనేజ్మెంట్
ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం అవసరం అయిన నిధులు, అనుమతులు మంజూరు చేయాలని
కోరారు.