తెలంగాణ సర్కార్ కరోనా టెస్ట్లు పెంచాలి: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2020-07-10T01:40:27+05:30 IST
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయే కానీ తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఈ కేసుల వ్యవహారమై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్లు పెంచాలని ఆయన సూచించారు. గురువారం నాడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్దన్తో మాట్లాడానన్నారు. కరోనా టెస్టులను పెంచబట్టే.. ఢిల్లీలో కరోనా నియంత్రణలోకి వస్తోందన్నారు. ఇప్పటి వరకూ.. తెలంగాణకు 7.14లక్షల N-95 మాస్క్లు, 2.41లక్షల పీపీఈ కిట్లు, 22.50 లక్షల టాబ్లెట్లను తెలంగాణకు కేంద్రం పంపిందని కిషన్రెడ్డి తెలిపారు.