ప్రతీ పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించాలి: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-05T19:35:22+05:30 IST

ప్రతీ పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించాలి: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ప్రతీ పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించాలి: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. కిషన్‌రెడ్డి నాటిన మొక్కను కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్ పంపించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటానికి పరిరక్షించడానికి ప్రతీ పౌరుడు చొరవ తీసుకోవాలని అన్నారు. తద్వారా భావితరాలను కూడా సురక్షితం చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-06-05T19:35:22+05:30 IST