దేశానికి ‘గ్రీన్ఇండియా ఛాలెంజ్’ అవసరం- కేంద్ర మంత్రి పురుషోత్తం
ABN , First Publish Date - 2020-09-19T01:06:55+05:30 IST
ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు ఇప్పుడు పర్యావరణ రక్షణ అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.
ఢిల్లీ: ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు ఇప్పుడు పర్యావరణ రక్షణ అని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని అశోక మొక్క నాటారు. ఈ కార్యక్రమాన్నిచేపట్టిన తెలంగాణకు చెందిన ఎంపీ సంతోష్కుమార్ను ఆయన మనస్పూర్తిగా అభినందించారు. యువకుడైన ఓక ఎంపీ పర్యావరణ హితమైన కార్యక్రమాన్ని చేపట్టి దేశ వ్యాప్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం అయ్యేందుకు అవసరమైన శక్తిని ఆ భగవంతుడు సంతోష్కుమార్కు ఇవ్వాలని ఆశీర్వదించారు. తన సహచర కేంద్ర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తానని ఈసందర్భంగా మంత్రి రూపాల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలునాటుతున్న ప్రతి ఒక్కరూ వాటి రక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు.