కోలాహలంగా ప్రమాణ స్వీకారోత్సవం
ABN , First Publish Date - 2020-12-04T06:19:01+05:30 IST
రాష్ట్రంలోనే ప్రథమంగా సెంట్రల్లో ఏర్పాటు చేసిన తెలుగు మహిళ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అజిత్సింగ్నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో గురువారం కోలాహలంగా జరిగింది.
అజిత్సింగ్నగర్, డిసెంబరు 3: రాష్ట్రంలోనే ప్రథమంగా సెంట్రల్లో ఏర్పాటు చేసిన తెలుగు మహిళ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అజిత్సింగ్నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో గురువారం కోలాహలంగా జరిగింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి, నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, సెంట్రల్ నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు మహిళలు తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, తెలుగు మహిళ పార్లమెంటు అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు.