సైరిగాం పీహెచ్సీని తనిఖీ చేసిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2021-10-23T04:54:41+05:30 IST
సైరిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యత ప్రమాణాల విభాగం (కేంద్రబృందం) అధికారులు అశీస్ గుప్తా, మేజర్ శివకుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.
జలుమూరు, అక్టోబరు 22: సైరిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యత ప్రమాణాల విభాగం (కేంద్రబృందం) అధికారులు అశీస్ గుప్తా, మేజర్ శివకుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఇన్ పేషెంట్స్, ఔట్ పేషెంట్స్ రికార్డులు, ప్రసూతి సేవలు, ల్యాబ్, సాధారణ పరిపాలనా విభాగం, జాతీయ ఆరో గ్య కార్యకర్తలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారులు గురునాథరావు, అనిత తదితరులు పాల్గొన్నారు.