గారలో కేంద్ర బృందం పర్యటన
ABN , First Publish Date - 2022-01-21T05:26:49+05:30 IST
మండలంలోని శ్రీకూర్మం, రామచంద్రాపురం, తూలుగు పంచాయతీల్లో గురువారం ఉపాధి హామీ పథకం జాతీయ పరిశీలన బృందం పర్యటించింది.
గార:
మండలంలోని శ్రీకూర్మం, రామచంద్రాపురం, తూలుగు పంచాయతీల్లో గురువారం
ఉపాధి హామీ పథకం జాతీయ పరిశీలన బృందం పర్యటించింది. తండ్యాలపేట,
కోనప్పగారిపేట, అంబటివానిపేట, జొన్నలపాడు గ్రామాల్లో చేపట్టిన చెరువు
పనులను పరిశీలించింది. అదేవిధంగా ఉద్యానవనపంటల సాగును పరిశీలించింది.
రైతులు, వేతన దారులతో కేంద్ర బృందం సభ్యులు ఎస్కే ప్రడీన్, సత్యబత్ర
బెహరాలు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్వామా పీడీ హెచ్.కూర్మారావు,
ఏపీడీ అలివేలు మంగమ్మ, వైస్ఎంపీపీ బరాటం రామశేషు, ఏపీవో సీహెచ్
సంధ్యారాణి పాల్గొన్నారు.