నేటి నుంచి వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
ABN , First Publish Date - 2021-11-26T09:20:02+05:30 IST
నేటి నుంచి వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గతవారం నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈనెల 26, 27, 28 తేదీల్లో వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నాయి. 26న చిత్తూరులో ఒక బృందం, 27న చిత్తూరులో ఒక బృందం, కడప జిల్లాలో మరో బృందం పర్యటించనున్నది. 28న నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటిస్తాయి. 29న కేంద్ర బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో భేటీ కానున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.