30.67 లక్షల మందికి దసరా బోనస్
ABN , First Publish Date - 2020-10-22T07:44:09+05:30 IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.... 2019-20 సంవత్సరానికి కేంద్రం బోన్సను ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన, ఉత్పాదకేతర బోన్సను...
- ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కానుక
న్యూఢిల్లీ, అక్టోబరు 21: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.... 2019-20 సంవత్సరానికి కేంద్రం బోన్సను ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన, ఉత్పాదకేతర బోన్సను తక్షణం అంటే దసరాకు ముందుగానే ఇచ్చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీని వల్ల ఖజానాపై పడే భారం రూ.3,737 కోట్లు. రైల్వేలు, పోస్టాఫీసులు, ఈపీఎ్ఫవో, ఈఎ్సఐసీ, రక్షణ రంగాల్లో పనిచేస్తున్న 16.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడ్డ బోనస్ (పీఎల్బీ), 13.70 మంది ఎన్జీవోలకు ఉత్పాదకతతో సంబంధం లేని (నాన్ పీఎల్బీ) తాత్కాలిక బోనస్ లభిస్తుందని సమావేశానంతరం సమాచార మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.
విజయదశమిలోగా ఒకే ఇన్స్టాల్మెంట్లో ఈ బోన్సను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందజేస్తామన్నారు. పండగవేళ ఉద్యోగులు ఎక్కువగా ఖర్చు చేస్తే ఆర్థికవ్యవస్థ కు ఊతమిచ్చినట్లవుతుందని ఆయన వెల్లడించారు. కొవిడ్ వల్ల ఈ ఏడాది బోనస్ ఇస్తారో లేదో అని మధనపడ్డ ఉద్యోగులకు ఇది పండగ కానుకే! సాధారణంగా వారంరోజుల ముందే దీన్ని చెల్లిస్తారు. ప్రభుత్వం ఈ దఫా ఆలస్యం చేయడంతో రైల్వే ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
కశ్మీర్లో పంచాయతీ రాజ్ చట్టానికి ఓకే.. త్వరలో ఎన్నికలు
జమ్మూకశ్మీర్ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. 1989లో రాష్ట్రం అవిభాజ్యంగా ఉన్నప్పుడు చేసిన ఈ చట్టం నాటి నుంచీ అమలు కాలేదు. కేంద్ర సమాచార మంత్రి జావడేకర్ మాటల్లో చెప్పాలంటే 370అధికరణ రద్దుకు ముందు ఈ చట్టం అమలు కాలేదు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో బ్లాక్,గ్రామ, జిల్లా స్థాయుల్లో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు వీలు కలుగుతుందని జావడేకర్ తెలిపారు. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కశ్మీర్లోనూ మూ డంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ మొదలవుతుందన్నారు. ఇది రాజకీయ ప్రక్రియకు నాందీ ప్రస్తావన చేయడమే. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పటికీ దశల వారీగా అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించి, అనంతరం రాష్ట్ర హోదాను కల్పిస్తామని హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ విభజన బిల్లు సమయంలో అన్నారు. జమ్మూ లో ఇబ్బంది ఉండకపోయినా శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ జిల్లాల్లోనూ, లోయలోనూ ప్రతిఘటన ఏర్పడవచ్చు. బీజేపీ మినహా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఒక్కతాటిపైకొచ్చి ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ఆందోళనల చేస్తున్న దశలో ఈ ఎన్నికల నిర్వహణ కేంద్రానికి సవాలే.