పాఠాల తొలగింపు ఈ విద్యా సంవత్సరానికే
ABN , First Publish Date - 2020-07-10T07:50:00+05:30 IST
సీబీఎస్ఈ 9 నుంచి 12 తరగతుల్లో కొన్ని ముఖ్యమైన పాఠాల తొలగింపుపై దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల పట్ల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు...
- సీబీఎస్ఈ సిలబ్సపై కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 9: సీబీఎస్ఈ 9 నుంచి 12 తరగతుల్లో కొన్ని ముఖ్యమైన పాఠాల తొలగింపుపై దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల పట్ల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. పాఠశాలల ప్రారంభం జాప్యంతో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకే సిలబ్సను తగ్గించినట్లు వివరించారు. ఈ నిర్ణయం 2020-21 విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితమని ట్విటర్లో స్పష్టం చేశారు.