జికా వైరస్ నేపథ్యంలో maharastra కు స్పెషల్ టీం

ABN , First Publish Date - 2021-08-03T01:03:32+05:30 IST

మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని

జికా వైరస్ నేపథ్యంలో maharastra కు స్పెషల్ టీం

ముంబై : మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపింది. వీరు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, ప్రజారోగ్యానికి అవసరమైన సిఫార్సులను చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ బృందంలో హార్డింగ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఓ గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి ఓ ఎంటమాలిజిస్ట్ (పురుగులపై పరిశోధన చేసేవారు) సభ్యులుగా ఉంటారు. ఈ బృందం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను అధ్యయనం చేస్తుంది.

Updated Date - 2021-08-03T01:03:32+05:30 IST